టాలీవుడ్లో ‘బేబి’ సినిమాతో రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య, ఇప్పుడు కోలీవుడ్లోనూ జెండా పాతేందుకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం అజిత్ కుమార్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వలిమై’లో వైష్ణవి ఒక చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్లో ఆమె ఒక స్టార్ హీరో పక్కన కనిపించడమే పెద్ద విశేషంగా భావించారు. కానీ, తన అంచలంచెలుగా ఎదుగుతూ, ఇప్పుడు అదే తమిళ పరిశ్రమలో ఏకంగా మెయిన్ లీడ్ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు,…