Conversion racket: ‘‘జిమ్ సెంటర్లు’’ కేంద్రంగా ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్లో మతమార్పిడి ముఠా కార్యకలాపాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా హిందూ మహిళలే లక్ష్యంగా మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇప్పటి వరకు 50 మంది హిందూ మహిళల్ని టార్గెట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. జిమ్లను రిక్రూట్మెంట్లు పాయింట్లుగా, సోషల్ మీడియాను సాధనాలుగా ఉపయోగించి, బాధితుల్ని ట్రాక్ చేసేవారని తేలింది.