Union Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం భారతదేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతుంది. సాధారణంగా ఫిబ్రవరి 1 ఆదివారం అంటే సెలవు రోజు.. కానీ, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అదే రోజు బడ్జెట్ 2026ను ప్రకటిస్తున్నందున, స్టాక్ మార్కెట్లు పని చేయాలని నిర్ణయించాయి.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ నిర్మాణంలో రీక్యాంప్ ఉంటుందని అంచనాలు. ఇది GST మోడల్తో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్ జియోపాలిటికల్ అస్థిరతల నేపథ్యంలో.. ఆర్థిక వేగాన్ని పెంపొందించడంతో పాటు భారతదేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.
దేశంలో కోట్ల మంది యువత ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని ఒకటుంది. అది జాబ్ కోసం ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేయడం! చదువు అయిపోయింది.. ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ? డిగ్రీలు చేతిలో ఉన్నాయి కానీ అవకాశాలు కనిపించడం లేదు. ఒకవైపు జనాభాలో యువత శాతం అత్యధికంగా ఉన్న దేశం భారత్. మరోవైపు నిరుద్యోగం, అండర్ఎంప్లాయ్మెంట్ అనే భయం. ఇదే కాంట్రాడిక్షన్ మధ్యలో ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2026 వస్తోంది. ఈ బడ్జెట్ యువతకు మరో స్కీమ్ ప్రకటించే…
Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక రికార్డుగా నిలవనుంది.
ఇల్లు కొనడమనేది అతి పెద్ద ఆర్థిక భారంగా మారిపోయిన రోజులివి. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం తలకు మించిన భారంగా మారింది. EMIలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, నిర్మాణ వ్యయాలను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే 2026 బడ్జెట్పై హౌసింగ్ రంగం ఆశలు పెట్టుకుంది. గత బడ్జెట్లో గృహ నిర్మాణానికి కేటాయింపులు పెరగడం, ట్యాక్స్ రాయితీలు డిమాండ్ను కొంత బలపరిచాయి. ఈ సారి విధాన మార్పులు కావాలని పరిశ్రమ కోరుకుంటోంది. ముఖ్యంగా అఫోర్డబుల్…
Union Budget 2026: కేంద్ర బడ్జెట్కు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిసిందే. ఈ ఉత్కంఠ బరిత సన్నివేశం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే.. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంశంపై సైతం చర్చలు జరుగుతున్నాయి. 2025లో భారత్ రియల్ ఎస్టేట్ రంగం మరింత బలంగా ముందుకు సాగింది. దేశ ఆర్థిక వృద్ధికి ఇది ఒక కీలక స్థంభంగా మారింది. ప్రభుత్వం…
మనమంతా రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో లడాఖ్లో ఒక జవాన్ మంచు తుఫానులో నిలిబడి ఉంటాడు. రాజస్థాన్ ఎడారిలో మరో జవాన్ 45 డిగ్రీల వేడిలో గస్తీ కాస్తుంటాడు. సముద్రం మధ్యలో నౌకపై ఇంకొకరు కంటిపాపలా దేశాన్ని కాపాడుతుంటారు. మనకు ఈ దేశం సురక్షితంగా అనిపించడానికి కారణం రాజకీయ నాయకుల స్పీచులు కాదు..సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్న త్రివిధ దళాల యోధులు. మరోవైపు ఇండియా సరిహద్దులు ఇప్పుడు ప్రశాంతంగా లేవు. ఓవైపు చైనా నుంచి…
రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బు చాలామందికి అదనపు ఆదాయం కాదు. అదే జీవనాధారం. బ్యాంక్లో వేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే మందులు కొనాలి, కిరాణా సరుకులు తీసుకోవాలి, ఇంటి రోజువారీ ఖర్చులు చూసుకోవాలి. కానీ ఇలాంటి వడ్డీ ఆదాయంపై ఇచ్చే పన్ను రాయితీలు సంవత్సరాలుగా మారలేదు. మరోవైపు ధరలు పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు పెరిగాయి. వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లు, స్మాల్ సేవర్స్పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఫిబ్రవరి…
Budget 2026: దేశ కేంద్ర బడ్జెట్–2026 కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. అనుభవజ్ఞులు, కొత్త ముఖాల కలయికతో కూడిన బడ్జెట్ బృందం ఈ కీలక బాధ్యతను భుజాన వేసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది మోడీ 3.0 ప్రభుత్వానికి మూడవ పూర్తి బడ్జెట్ కావడం విశేషం. ఈసారి ఫిబ్రవరి…
బడ్జెట్ అనగానే పన్ను రాయితీలు, ఉద్యోగాలు, జీతాలు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ 2026 బడ్జెట్ను చూసే జెన్-జీ దృష్టి అక్కడితో ఆగడం లేదు. ఉద్యోగ భద్రత లేని ప్రపంచంలో పెరిగిన తరం ఇది. కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, క్లైమేట్ మార్పులు అన్నింటినీ చిన్న వయసులోనే చూసింది. అందుకే ఈ తరం ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలు భిన్నంగా ఉన్నాయి. జీతం ఎంత వస్తోందన్నదాని కంటే, ఆ జీతంతో జీవించగలుగుతున్నామా? మానసిక ఆరోగ్యానికి భద్రత ఉందా?…