‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ‘డాల్బీ సినిమా’ స్క్రీన్లో ప్రదర్శించబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డులకెక్కనుంది. అల్లు ఫ్యామిలీ ఆధ్వర్యంలో ‘అల్లు సినిమాస్’ అంటూ ఒక మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్లోనే డాల్బీ సినిమా స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ థియేటర్ను నిన్ననే రేవంత్ రెడ్డి ప్రారంభించగా, ఈరోజు ప్రత్యేకంగా ఫిలిం మీడియాను ఆహ్వానించి అల్లు అరవింద్ మరో…