నేడు ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నారు. తుడుం దెబ్బ రాయి సెంటర్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసి చట్టాల అమలు, హక్కులు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసి చట్టాలు హక్కులు జీవోలు అన్నీ కూడా కాలరాస్తున్నాయని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, వారిపై దాడులను తిప్పికొడుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే…