కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. థర్డ్ వేవ్పై రకరకాల అంచనాలున్నాయి.. అయితే.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కారణంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతమగానే నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ.. ఈ విషయాన్ని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఇక, మరో వారంరోజులలో ఆన్లైన్లో సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభిస్తామన్న ఆయన.. మరోవైపు.. అన్నమయ్య కీర్తనలకు బహుళ ప్రచారం కల్పిస్తాం అన్నారు.. అన్నమయ్య కీర్తనలు అన్నింటికి…
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని..…
ఇటీవలే టిటిడి చైర్మన్ పదవి బాధ్యతలను.. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి జగన్ సర్కార్ అప్పగించిన సంగతి తెలిసిందే. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో భాగంగా… వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు వైవి సుబ్బారెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలజగడానికి తెరదించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో గెజిట్ విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలు ఓవైపు.. ఆహ్వానించడాలు మరోవైపు జరుగుతున్నాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం జలాల విషయంలో చేసిన గెజిట్ శుభపరిణామం అంటున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పాలమండలిలో చర్చించిన అంశాలు.. తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత వివరించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామన్న ఆయన.. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.. ఏపీలో…
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీటీడీ.. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. దీంతో.. తిరుమలలో వందేళ్ల కిందటి సంప్రదాయాన్ని శ్రీవారి ఆలయంలోపున:ప్రారంభించామన్న ఆయన.. గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేథ్యం సమర్పించాం.. అద్భుతంగా ఉందని భక్తులు ప్రశంసించారన్నారు.. లడ్డూ ప్రసాదం కూడా ఆర్గానిక్ పదార్థాలతో ప్రయోగాత్మకంగా తయారు చేయించామని.. లడ్డూ ప్రసాదం కూడా చాలా రుచికరంగా వచ్చిందన్నారు..…