తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పార్టీని వీడుతున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్పై ప్రసంశలు కురిపించిన ఆయన.. ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.. ఇదే సమయంలో.. మంత్రి హరీష్రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో.. Read Also: Dharmana: కేసీఆర్ వ్యాఖ్యలతో…
మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం గులాబీ గూటిలో ఉన్న నేతల మధ్య విభేదాలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నేడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో రసాబాసగా మారింది. సమావేశాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బాయ్ కట్ చేశారు. అధికార పార్టీ మేయర్ సామల బుచ్చిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవి గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ బయట నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్…
ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని ఆయన అన్నారు. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ…
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులను సంఘటితం చేసి, తద్వారా వచ్చే లాభాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6…
బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో విద్యార్థినుల వసతి గృహానికి ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. ఇక, కొన్ని సందర్భాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పర్యటనలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి.. కొన్ని సార్లు, దాడులు, ప్రతిదాడులకు కూడా దారితీశాయి.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు…
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు… సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే.. ఎదైనా పిచ్చి పోస్టులు పెడితే సీరియస్గా ఉంటుందని హెచ్చరించిన ఆయన.. ఇంకో సారి పోస్టు పెడితే నీ సంగతి చెబుతా నంటూ సీరియస్గా హెచ్చరించారు.. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..…
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ నేతలు మూడు రోజలు నిర్వహించ తలపెట్టారు. 15 తేది నుంచి 17వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం, రక్త శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు…
అస్సాం సీఎం రాహుల్గాంధీపై చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్లు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అస్సాం సీఎంపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నేడు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు…
ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు… కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల వ్యవహారం నుంచి.. రాజకీయ విమర్శల వరకు ఈ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న చందంగా ఉంది పరిస్థితి.. అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పీఎం మిత్రలో చేరాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.. వస్త్ర…