తెలంగాణ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి అని నమ్మించి మోసం చేసిన సీఎం కేసీఆరే దళితుల ప్రధాన శతృవు అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏడేండ్లపాలనలో దళితులకు అన్యాయమే జరిగింది, ఏనాడూ దళితబంధు కాలేదు.. కేసీఆర్ రాబందులా కనిపిస్తున్నాడు అంటూ మందకృష్ణ విమర్శలు చేశారు. కేసీఆర్ అవసరమైన సమయంలో ఎదో నిర్ణయం తీసుకుంటాడు ఆతర్వాత పక్కకు పడేస్తాడు. హుజూరాబాద్ లో మెజార్టీ ఓట్లు దళితుల ఉన్నాయి కాబట్టే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు తీసుకొచ్చాడు,…