మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి మల్లారెడ్డి పేరు చెబితేనే పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. మల్లారెడ్డి ఇలాకాలోనే కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిపి మొత్తం 8 మంది టీఆర్ఎస్కు గుడ్బై చెప్పేశారు. వారి రాజీనామాల అంశం ఇప్పుడు స్థానికంగా సెగలు రేపుతోంది. మంత్రి అవమానిస్తున్నారని ఆరోపణలు..!జిల్లాలోని కీసర టీఆర్ఎస్లో నేతల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అవి తాజాగా భగ్గుమనడంతో రాజీనామాల వరకు వెళ్లింది. యాదర్పల్లి ఉప సర్పంచ్ సహా 8మంది…