Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే(టీఎంసీ), పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లా అధ్యక్షుడు అబ్దుర్ రహీమ్ భక్షీ చేసిన బెదిరింపు వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఒక బహిరంగ ర్యాలీలో భక్షీ మాట్లాడుతూ.. బీజేపీ నేతల నోటిలో యాసిడ్ పోస్తానని బెదిరించారు. ఆయన సిలిగురి బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల వివాదస్పదం కావడంతో తాను అలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.