కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బీడీ కాల్చారు. సోమవారం నాడు కమలాపురంలో పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అడుగుతూ ముందుకు సాగిపోతుండగా.. ఓ ఇంట్లో బీడీ తయారీ ప్రక్రియను చూసి మంత్రముగ్ధుడయ్యారు. దీంతో కార్మికుడు తయారుచేసిన బీడీ తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. బీడీని అంటించుకుని స్టైలుగా పొగ వదలడంతో అక్కడున్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు. Read Also: రాఘవ లారెన్స్ గొప్ప…
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో మద్యం తాగడంపై నిషేధం విధించారు. ఈ మేరకు గ్రామ కమిటీ పేరుతో గ్రామంలో హెచ్చరిక బోర్డులు వెలిశాయి. కొందరు వ్యక్తులు మద్యం తాగిన మత్తులో సీసాలు పగలకొట్టడం, మద్యం బాటిళ్లను పొలాల్లో, రోడ్లపైనే పడేస్తుండటంతో విసుగు చెందిన గ్రామ పెద్దలు మద్య నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. Read Also: వైరల్: బుడ్డోడి టాలెంట్కు ఆనంద్ మహీంద్రా ఫిదా తమ గ్రామ పరిధిలో పొలాలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో…
మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం కట్టడి చేయడం కోసం అంటూ 2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై…
ఫేస్బుక్ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్ బుక్ వినియోగాదారుల డాటా లీక్ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్బుక్. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్బుక్ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ కోర్టును ఆశ్రయించారు.…
ఆఫ్రికా దేశంలోని సియర్రా లియోన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 91 మంది మృతి చెందగా 100 మంది గాయాలయ్యాయి. సియర్రా లియోన్లోని ఫ్రీటౌన్లో ఓ లారీని చమురు ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనాలను అక్కడే ఉంచారు. చమురు ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవుతుండడంతో చమురు కోసం స్థానిక జనాలు ఎగబడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చమురు ట్యాంకర్లో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. దీంతో 91 మంది మంటల్లో చిక్కుకొని…
తెలంగాణలోని మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలచిన వారు ఈ నెల 10 నుంచి 18 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. నాన్ రిఫండబుల్ అమౌంట్ రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన మద్యం షాపుల లాటరీ తీయనున్నట్లు ప్రకటించింది. అయితే గత 2019 నిర్వహించిన లాటరీలో మద్యం షాపులు వచ్చినవారి గడువు అక్టోబర్తో ముగిసింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు…
దేశంలో డిజిటల్ విప్లవం ఎంతవరకు సాధ్యమైంది ఈ వీడియో ను చూసి మనం తెలుసోవచ్చు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ప్రధాని మోడీ డిజిటల్ విప్లవానికి తెర లేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏ చిన్న కిరాణా కొట్టు, పాన్, టీ స్టాల్ ఇలా చిన్న చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు ఇంటిముందుకు గంగిరెద్దులను తీసుకువచ్చి ఆటలాడిస్తుంటారు. అలా వచ్చిన వారికి బియ్యంతో…
తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి వేళ కుటుంబంతో ఎంతో ఆనందంగా టపాసులు కాల్చుదామని టపాసులు కొనుకొన్ని తన కుమారుడితో ఇంటికి వెళ్తుండగా ఉన్నంటుండి ఆ టపాసులు పేలడంతో ఆ తండ్రీకొడుకులు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పుదిచ్చేరికి చెందిన కలైనేషన్ (35) అనే వ్యక్తి విల్లుపురంలోని తన అత్తగారింట్లో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కలైనేషన్ తన కుమారుడు ప్రదేశ్ (7)తో…
యావత్తు ప్రపంచాన్నే కరోనా మహమ్మరి అతలాకుతలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్చినమయ్యాయి. కుటుంబ పెద్దలు కరోనా సోకి మరణించడంతో ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మారారు. ప్రపంచ విపత్తుగా కరోనా కాలాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ కరోనా నుంచి బయట పడేందుకు దేశాలు తమతమ శాస్త్రవేత్తలు కనుగొన్న కోవిడ్ టీకాలను ప్రజలకు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కోవిడ్ చికిత్స కోసం…
చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మన దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. ఇంట్లో ఉంటే చిన్నారులకు అయితే దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అందుకే పిల్లల కోసం ఎక్కువ సంఖ్యలో క్రాకర్స్ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నారులు టపాసులు కాల్చాలని మారం చేసినా భారీ శబ్ధాలు రాని, పర్యావరణానికి…