హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్హౌస్లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక అంశం ఒకటి బయటికొచ్చింది. గత రెండు సంవత్సరాలుగా పోచంపల్లి ఫామ్హౌస్లో నిత్యం కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 సంవత్సరాల్లో పందేల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన క్యాసినో, కోడిపందేల సమాచారం…