Farm House Case: తొల్కట్ట ఫామ్హౌస్ కేసులో కీలక ట్విస్ట్!
- ఫామ్హౌస్లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ
- ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు
- పారిపోయిన ఎమ్మెల్సీ పోచంపల్లి మేనల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్హౌస్లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక అంశం ఒకటి బయటికొచ్చింది. గత రెండు సంవత్సరాలుగా పోచంపల్లి ఫామ్హౌస్లో నిత్యం కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 సంవత్సరాల్లో పందేల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నిర్వహించిన క్యాసినో, కోడిపందేల సమాచారం తెలుసుకొని పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకతో పలువురు జూదగాల్లు స్పాట్ నుండి పారిపోయారు. పారిపోయిన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి కూడా ఉన్నాడు. జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మరికొందరు ప్రముఖులు పారిపోయారు. పారిపోతూ సుమారు రూ.40 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జ్ఞానదేవ రెడ్డితో పాటు మిగతా వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: NABARD State Focus Paper: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: మంత్రి తుమ్మల
తొల్కట్ట ఫామ్హౌస్లో మంగళవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో 64 మంది పట్టుబడ్డారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్హౌస్పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్హౌస్ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎమ్మెల్సీ పోచంపల్లి చెబుతున్న నేపథ్యంలో.. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నిన్న నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ తో పాటు సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద పోచంపల్లిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!