ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడిక్కించాయి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు.. సీఎం వైఎస్ జగన్, వైసీపీ సర్కార్, కొందరు మంత్రులను, డీజీపీని టార్గెట్ చేస్తూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడుతోంది.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు యత్నించాయి.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, అయ్యన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు..…
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. 7వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 15న చక్రస్నానం, ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక, 7వ తేదీన రాత్రి పెద్దశేష…
అక్టోబర్ 11న ఆంధ్ర సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. అయితే తిరుమలలో అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందు భాగంగా 11 రాత్రి జరగనున్న గరుడ సేవ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు సీఎం జగన్. అదే రోజు అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గో మందిరం….తిరుమలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ…
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా తయారైంది TTD పరిస్థితి. ఏకంగా 75 మందితో బోర్డు ఏర్పాటుకు కసర్తతు పూర్తయింది. ఇదే TTDకి సంకటంగా మారినట్టు టాక్. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా.. అంతమంది పాలకమండలి సభ్యులను సంతృప్తిపర్చడం TTDకి పెద్ద సవాలేనా? ఒత్తిళ్లతో ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పెరిగిందా? తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఎట్టకేలకు పూర్తయింది. సంప్రదాయాలను పక్కన పెట్టి.. 75 మందితో బోర్డు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 25 మంది బోర్డులో ఉంటారు.…
తిరుమల శ్రీవారి ఆలయంలో 5 నెలలుగా నిలిచిన సర్వదర్శనం సడెన్గా ఎలా ప్రారంభమైంది? టీటీడీ ప్రయోగాత్మక పరిశీలన కూడా పూర్తికాని.. సంప్రదాయ భోజన పథకం ఎందుకు ఆగిపోయింది? ఈ రెండు నిర్ణయాల వెనక ఉన్నది ఎవరు? టీటీడీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తిరుమలలో ఆగమశాస్త్రానికే పెద్దపీట..! కలియుగ వైకుంఠనాధుడి సన్నిధిలో చిన్నపాటి మార్పులు చేయాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. మరేన్నో వివరణలు ఇచ్చుకోవాలి. అధికారులకు నచ్చిందనో.. పాలకమండలి మెచ్చిందనో.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని అమలుచేసే పరిస్థితి…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి జాబితాను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేశారు.. టీటీడీ కొత్త పాలక మండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మేల్యేలు కాటసాని, గోర్ల బాబు రావు, మధుసూదన్ యాదవ్కు చోటు దక్కగా.. తెలంగాణ నుంచి రామేశ్వరావు, లక్ష్మీ నారాయణ, పార్థసారధిరెడ్డి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యా సాగర్కు అవకాశం…
టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా దాదాపుగా ఖరారైంది. మొదటి విడతలో పాలకమండలి సభ్యుల జాబితాను విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రెండవ విడతలో ప్రత్యేక ఆహ్వనితుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పాలకమండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి క్రిష్ణారావు,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ఎమ్మేల్యేలు కాటసాని,గోర్లబాబురావు,మధుసూదన్ యాదవ్… తెలంగాణ నుంచి రామేశ్వరావు,లక్ష్మినారాయణ,పార్దసారధి రెడ్డి,మూరంశెట్టి రాములు,కల్వకుర్తి విద్యాసాగర్… తమిళనాడు నుంచి శ్రీనివాసన్,ఎమ్మేల్యే నందకుమార్,కన్నయ్య… కర్నాటక నుంచి శశిధర్,ఎమ్మల్యే విశ్వనాధ్ రెడ్డి… మహారాష్ట్ర నుంచి…
అమరావతి : నూతన టీటీడీ పాలక మండలి ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ టీటీడీ పాలక మండలి పై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఈ సారి ఏకంగా 25 మంది రెగ్యులర్ సభ్యులతో పాలక మండలి ఏర్పాటు కానుంది. ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి, భూమన, మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కొనసాగనున్నారు. అలాగే… ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది ఈ టీటీడీ పాలక మండలి లో ఉండనున్నారు.…
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని..…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… రేపటి నుంచి అలిపిరి వద్ద రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపత దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రతే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ…