కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. మార్చి నెలకు సంబంధించిన వివిధ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మార్చి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ..
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల నిర్ణయ ప్రకారం, రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేస్తారు. ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో మాసోత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ధనుర్మాస ఘడియలు ఈరోజు ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, టీటీడీ సుప్రభాత సేవల రద్దుకు సంబందించిన నిర్ణయాన్ని తీసుకుంది. తిరుప్పావైతో మేల్కొలుపు: ధనుర్మాస సమయంలో సుప్రభాత సేవల స్థానంలో తిరుప్పావై పాశురాలు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూ లైన్లోనికి అనుమతించరు. అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు…
తిరుమలలో కారులో మంటలు చెలరేగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కారు దగ్ధమైంది.. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భక్తులు పరుగులు తీశారు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.. అప్పటికే మంటల్లో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు..
Priyanka Jain: తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ వీడియో విడుదల చేశారు. సరదా కోసం చేసిన వీడియో ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేదు.
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి నేడు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేశారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు.. బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం…
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం భయటపడింది. ఈ సారి ఏకంగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించే అర్చకులు బస చేసే అర్చక నిలయం ముందే క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రభోధాలు ఉన్న వాహనాన్ని నిలపడం విమర్శలకు దారితీసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీవారికి సమర్పించే ప్రసాదాల నాణ్యత బాగా పెరిగిందన్నారు. 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందజేసే రూ.5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచామన్నారు. ప్రతి నెల తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులును పరిశిలిస్తాను అని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగుతోంది. భూదేవి కాంప్లెక్స్లో లడ్డు కల్తీ వ్యవహారంపై సీబీఐ సిట్ బృందం సమావేశమంది. డీఎస్పీ, సీఐలు సహా ఇతర అధికారులు సీబీఐ ఎస్పీ మురళి రాంబాతో సమావేశం కానున్నారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభించింది. అధికారులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సిట్ అధికారులు తిరుమలలో రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు…