Tirumala: నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
- నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
- 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు
- హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా కేటాయించబడ్డాయి. అలాగే, 19,500 శ్రీవాణి దర్శన టికెట్లను కూడా కేటాయించామని ఆలయ కమిటి ప్రెసిడెంట్ ఇఓ శ్యామలరావు తెలిపారు.
Also Read: Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
సర్వదర్శనం భక్తులకు 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మూడు రోజుల పాటు 1,20,000 టోకెన్లు జారీ చేయబడతాయి. తిరుమలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో 10 రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసారు. ఇదిలా ఉండగా, జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత, జనవరి 10వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీవారి స్వర్ణ రథం ఉరేగింపును నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం 4:30 నుండి 5:30 గంటల మధ్య పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రయాగలో కుంభమేళా సందర్భంగా, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు శ్రీవారి నమూనా ఆలయం నిర్మించబడనుంది.
Also Read: Donald Trump On Tiktalk: టిక్టాక్ నిషేధంపై డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకుంటున్నారా?
తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రత్యేక దర్శనాలను 10వ తేది ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని వారిని, ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని కియోస్కి విధానం ద్వారా విరాళాలు పెరుగుతున్నాయని, గత 15 రోజుల్లో 55 లక్షల రూపాయల విరాళాలు అందినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!