Tirumala: నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
- నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
- 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు
- హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా కేటాయించబడ్డాయి. అలాగే, 19,500 శ్రీవాణి దర్శన టికెట్లను కూడా కేటాయించామని ఆలయ కమిటి ప్రెసిడెంట్ ఇఓ శ్యామలరావు తెలిపారు.
Also Read: Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
సర్వదర్శనం భక్తులకు 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మూడు రోజుల పాటు 1,20,000 టోకెన్లు జారీ చేయబడతాయి. తిరుమలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో 10 రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసారు. ఇదిలా ఉండగా, జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత, జనవరి 10వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీవారి స్వర్ణ రథం ఉరేగింపును నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం 4:30 నుండి 5:30 గంటల మధ్య పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రయాగలో కుంభమేళా సందర్భంగా, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు శ్రీవారి నమూనా ఆలయం నిర్మించబడనుంది.
Also Read: Donald Trump On Tiktalk: టిక్టాక్ నిషేధంపై డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకుంటున్నారా?
తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రత్యేక దర్శనాలను 10వ తేది ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని వారిని, ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని కియోస్కి విధానం ద్వారా విరాళాలు పెరుగుతున్నాయని, గత 15 రోజుల్లో 55 లక్షల రూపాయల విరాళాలు అందినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!