Tirumala: నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
- నవంబర్ నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
- 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు
- హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో హుండీలో 111 కోట్లు 97 లక్షల రూపాయల విలువ చేసే కానుకలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా కేటాయించబడ్డాయి. అలాగే, 19,500 శ్రీవాణి దర్శన టికెట్లను కూడా కేటాయించామని ఆలయ కమిటి ప్రెసిడెంట్ ఇఓ శ్యామలరావు తెలిపారు.
Also Read: Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి
Also Read
- Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
సర్వదర్శనం భక్తులకు 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మూడు రోజుల పాటు 1,20,000 టోకెన్లు జారీ చేయబడతాయి. తిరుమలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో 10 రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసారు. ఇదిలా ఉండగా, జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత, జనవరి 10వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీవారి స్వర్ణ రథం ఉరేగింపును నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం 4:30 నుండి 5:30 గంటల మధ్య పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రయాగలో కుంభమేళా సందర్భంగా, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు శ్రీవారి నమూనా ఆలయం నిర్మించబడనుంది.
Also Read: Donald Trump On Tiktalk: టిక్టాక్ నిషేధంపై డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకుంటున్నారా?
తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రత్యేక దర్శనాలను 10వ తేది ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని వారిని, ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని కియోస్కి విధానం ద్వారా విరాళాలు పెరుగుతున్నాయని, గత 15 రోజుల్లో 55 లక్షల రూపాయల విరాళాలు అందినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!