తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డా సంరక్షణకు పెద్ద పీట వేస్తుంది. ఈనేపథ్యంలో సర్కారు దావాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది.