పారిస్ ఒలింపిక్స్ 2024లో ముగ్గురు తల్లులు పతకాలు సాధించారు. బ్రిటన్కు చెందిన వెటరన్ హెలెన్ గ్లోవర్.. న్యూజిలాండ్ క్రీడాకారిణులు లూసీ స్పూర్స్, బ్రూక్ ఫ్రాన్సిస్లు ఉన్నారు. మహిళల డబుల్ స్కల్స్లో స్పూర్స్.. ఫ్రాన్సిస్ బంగారు పతకాన్ని గెలుచుకోగా, మహిళల ఫోర్లో ముగ్గురు పిల్లల తల్లి గ్లోవర్ రజతం సాధించింది. కాగా.. స్పూర్స్, ఫ్రాన్సిస్ తమ ఆట ముగిసిన అనంతరం లైన్ దాటి.. తమ బిడ్డలను కౌగిలించుకోవడానికి స్టాండ్లలోకి వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.