Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని అడిగినందుకు సుత్తితో కొట్టి ముగ్గురిని చంపేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని పదే పదే ఓ కుటుంబం ఓ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో విసుగుచెందిన ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్లోని లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది. 46 ఏళ్ల నిందితుడిని ఆ కుటుంబంలోని వ్యక్తులు బిడ్డను కనాలని వేధించడంతో ముగ్గురిని సుత్తితో కొట్టి చంపినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు రాబిన్ అలియాస్ మున్నా బాధిత కుటుంబానికి పొరుగున నివసిస్తున్నాడు. ఈ సంఘటన గురువారం జరిగిందని లూథియానా పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాబిన్ అలియాస్ మున్నా అనే ఓ వ్యక్తి పక్కింట్లో సురీందర్ కౌర్ (70), ఆమె భర్త చమన్ లాల్ (75), ఆమె అత్త (సుమారు 90 ఏళ్లు) ఉంటున్నారు. మున్నాకు పెళ్లై కొన్నేళ్లు అవుతున్నా సంతానం కలగలేదు. దీంతో పక్కింట్లో ఉంటున్న సురీందర్ కౌర్, ఆమె భర్త చమన్ లాల్ మున్నాను పిల్లలు కనాలని అడిగేవారని చెప్పారు. అయితే గురువారం కూడా ఇలా ఒకరి తర్వాత వాళ్లు అతడిని సంతానం విషయమై మాట్లాడారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మున్నా సుత్తితో ఆ ముగ్గురి తలపై కొట్టాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని కమిషనర్ మన్ దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు. తన తర్వాత భార్యను చూసుకునే వారు ఎవరూ లేరని, తన భార్యను కూడా అరెస్ట్ చేయాలని వేడుకున్నాడు. మున్నా నేరం చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు.
Also Read: Farming: గోమూత్రంతో పంటల సాగు.. పెరిగిన దిగుబడి..!
నేరాన్ని యాక్సిడెంట్గా చూపించడానికి, మున్నా వంట గ్యాస్ సిలిండర్ వాల్వ్ని తెరిచి, అగరబత్తిని వెలిగించాడు, తద్వారా గదిలో మంటలు వ్యాపించాయి. అన్ని ఆధారాలు ధ్వంసమయ్యాయి. మున్నా నుంచి బాధితుల్లో ఒకరికి చెందిన కెమెరా, మొబైల్ ఫోన్ ఉన్న బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యూవీ లైట్ కింద ఉన్న సుత్తిపై రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
శుక్రవారం ఉదయం బాధితుల ఇంటికి తాళం వేసి ఉండడంతో పాల వ్యాపారి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించగా ఎవరూ స్పందించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. గురువారం కూడా ఎవరూ ఇంటి తలుపులు తెరవలేదని పాల వ్యాపారి పోలీసులకు తెలిపాడు. ఇరుగుపొరుగు వారు ముందు గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులు ముగ్గురు చనిపోయారని పోలీసులు తెలిపారు. కౌర్, లాల్ల నలుగురు కుమారులు విదేశాల్లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!