Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని అడిగినందుకు సుత్తితో కొట్టి ముగ్గురిని చంపేశాడు..
Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని పదే పదే ఓ కుటుంబం ఓ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో విసుగుచెందిన ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్లోని లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది. 46 ఏళ్ల నిందితుడిని ఆ కుటుంబంలోని వ్యక్తులు బిడ్డను కనాలని వేధించడంతో ముగ్గురిని సుత్తితో కొట్టి చంపినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు రాబిన్ అలియాస్ మున్నా బాధిత కుటుంబానికి పొరుగున నివసిస్తున్నాడు. ఈ సంఘటన గురువారం జరిగిందని లూథియానా పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
- Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాబిన్ అలియాస్ మున్నా అనే ఓ వ్యక్తి పక్కింట్లో సురీందర్ కౌర్ (70), ఆమె భర్త చమన్ లాల్ (75), ఆమె అత్త (సుమారు 90 ఏళ్లు) ఉంటున్నారు. మున్నాకు పెళ్లై కొన్నేళ్లు అవుతున్నా సంతానం కలగలేదు. దీంతో పక్కింట్లో ఉంటున్న సురీందర్ కౌర్, ఆమె భర్త చమన్ లాల్ మున్నాను పిల్లలు కనాలని అడిగేవారని చెప్పారు. అయితే గురువారం కూడా ఇలా ఒకరి తర్వాత వాళ్లు అతడిని సంతానం విషయమై మాట్లాడారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మున్నా సుత్తితో ఆ ముగ్గురి తలపై కొట్టాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని కమిషనర్ మన్ దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు. తన తర్వాత భార్యను చూసుకునే వారు ఎవరూ లేరని, తన భార్యను కూడా అరెస్ట్ చేయాలని వేడుకున్నాడు. మున్నా నేరం చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు.
Also Read: Farming: గోమూత్రంతో పంటల సాగు.. పెరిగిన దిగుబడి..!
నేరాన్ని యాక్సిడెంట్గా చూపించడానికి, మున్నా వంట గ్యాస్ సిలిండర్ వాల్వ్ని తెరిచి, అగరబత్తిని వెలిగించాడు, తద్వారా గదిలో మంటలు వ్యాపించాయి. అన్ని ఆధారాలు ధ్వంసమయ్యాయి. మున్నా నుంచి బాధితుల్లో ఒకరికి చెందిన కెమెరా, మొబైల్ ఫోన్ ఉన్న బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యూవీ లైట్ కింద ఉన్న సుత్తిపై రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
శుక్రవారం ఉదయం బాధితుల ఇంటికి తాళం వేసి ఉండడంతో పాల వ్యాపారి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించగా ఎవరూ స్పందించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. గురువారం కూడా ఎవరూ ఇంటి తలుపులు తెరవలేదని పాల వ్యాపారి పోలీసులకు తెలిపాడు. ఇరుగుపొరుగు వారు ముందు గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులు ముగ్గురు చనిపోయారని పోలీసులు తెలిపారు. కౌర్, లాల్ల నలుగురు కుమారులు విదేశాల్లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!