వరంగల్ నగర మాజీ మేయర్ అరెస్ట్ అయ్యారు. భవిత శ్రీ చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో భవిత శ్రీ చైర్మన్, మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావును అరెస్టు చేశారు హన్మకొండ పోలీసులు.. హనుమకొండ లో ఉన్న భవిత శ్రీ చిట్ ఫండ్ లో చిట్టీలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాధితులు.. గడువు పూర్తయినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో భవిత శ్రీ చిట్ ఫండ్ చైర్మన్ గుండా ప్రకాష్ రావుతోపాటు…
హైదరాబాద్ మెట్రో రైల్ పై కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రో నుండి ఎల్ ఎండ్ టి తప్పుకున్నది. తెలంగాణ ప్రభుత్వం, ఎల్&టీ సీఎండీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్ మెట్రో రైల్. ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయం మెట్రో అధికారులతో సీఎం రేవంత్ భేటి అయ్యారు. మెట్రో రైల్ నెట్వర్క్ పొడవు పరంగా 2014లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయింది.ఎల్&టీ…
ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. దసరాకు లక్కీ డ్రా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్కు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. Also Read:Telangana : తెలంగాణలో దసరా షాపింగ్ బీభత్స…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఫలితాల్లో ఓ కానిస్టేబుల్ సత్తాచాటారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం పెప్పర్ వాడకు చెందిన శశిధర్ రెడ్డి(కానిస్టేబుల్) గ్రూప్-1 ఫలితాల్లో ఏ టి ఓ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. కానిస్టేబుల్ నుంచి గ్రూప్ వన్ కు ఎంపికై కష్టపడితే…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి…
తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణాలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా, సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. 2500 కీ మీ మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఈ పదేళ్లలో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే 5 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు. Also Read:Illegal Sand Transportation: ఆంధ్రా…
తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈనెల 26నుంచి ఆక్టోబర్ 18వరకు కొత్త దుకాణాల లైసెన్స్ ల జారీకి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కొత్త మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలు చెల్లించి మద్యం టెండర్లలో…
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. తిరుపతికి చెందిన డాక్టర్ సహా ఇద్దరు మృతి.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు, అతని కూతురు మృతిచెందారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయల్దేరి వెళ్తుండగా.. తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం…
* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు.. కుటుంబ సభ్యులతో సహా హాజరుకానున్న డీఎస్సీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులు * ఈ నెల 30 వరకు తెలంగాణకు భారీ వర్ష సూచన.. రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం.. * ఇవాళ ఢిల్లీలో డీసీసీ పరిశీలకుల నియామక ప్రక్రియలపై దిశానిర్దేశం.. తెలంగాణ డీసీసీ నియామకాల కోసం…