తెలంగాణ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన విమర్శలు చేసే నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గతంలో పాలన ఎలా ఉండేదో గుర్తుకు ఎరిగి మాట్లాడితే మంచిదన్న ఆయన కేంద్రం నిధులు ఇస్తే పేర్లు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంది అని విమర్శలు చేస్తున్నారు. వాస్తవం తెలుసుకొని మాట్లాడితే ప్రజలు ఆ నాయకులకు గౌరవం దక్కుతుందని అన్నారు. కేంద్ర పథకాలు మేము కాపీ కొట్టడం లేదు .మన రాష్ట్ర…
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారం ఉధృతం చేస్తున్నాయి. గులాబీ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కేసీఆర్ పూర్తి కాన్సంట్రేషన్ తో ప్రచార సరళిని నడిపిస్తున్నాడు. నియోజకవర్గంలో ఎన్నికలు సమీపించిన తర్వాత రెండో బహిరంగ…
కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. భారత్ లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్డీఏ, ఈఎంఏ, బ్రిటన్ ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ జపాన్ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్లపై ఏర్పాటు…
నాగార్జున సాగర్లో ఏర్పాటుచేయనున్న సీఎం సభను రద్దు చెయాలని యుగ తులసి ఫౌండేషన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని ప్రభుత్వం జీవో నెంబర్ 69 విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అందుకే ఏప్రిల్ 14 న సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను రద్దు చేయాలని కోర్టును కోరాడు పిటీషనర్ శివకుమార్. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సభను రద్దు చేయాలని కోరారు. ఈనెల…
తెలంగాణ మంత్రి కేటీఆర్కు వరంగల్లో పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది.. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపలను, ప్రారంభోత్సవాల కోసం వరంగల్ వెళ్లిన కేటీఆర్ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. మొదట కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను ప్రారంభించిన కేటీఆర్.. రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.. అనంతరం.. కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు ఏబీవీపీ కార్యకర్తలు.. కాన్వాయ్ వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చారు.. వారిని నిలువరించేందుకు పోలీసులు…
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.. సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన.. జానారెడ్డి పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్న ఆయన.. గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గిరిజనులకు 10 శాతం…
సీపీఎం పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జి అనారోగ్య కారణాలతో అస్తమించారు.. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతోన్న ఆయన గత నెల తీవ్ర అస్వస్థతకు గురికాగా.. భద్రాచలం పరిధిలో గల ప్రభా శంకర్ ఆస్పతిలో చేర్పించారు.. ఆయన వయస్సు 95 ఏళ్లు.. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు.. నేటి తరానికి ఆదర్శ నేతగా.. నిజాయితీకి ప్రతిరూపంగా బతికిన ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు.. ప్రజలే నా…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న 11:30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్…
ఆరు మందిని హత్య చేసాడు 60 ఏళ్ల కిష్టప్ప. ఈనెల 26న అమృతమ్మ అనే మహిళ హత్య జరిగింది. ఆ మహిళ హత్యకేసును చేధించారు వికారాబాద్ పోలీసులు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు వికారాబాద్. డి.ఎస్.పి సంజీవ్ రావ్. అమృతమ్మతో కలిపి మొత్తం ఆరు మందిని చేసాడు నిందితుడు అల్లిపూర్ కిష్టప్ప. 1985 నుండి 2021 వరకు ఆరు మందిని చేసాడు. కిష్టప్ప పై 1985 లొనే రౌడీషిట్ ఓపెన్ చేసారు పోలీసులు. వికారాబాద్ జిల్లాలో…