రెండు రోజులుగా బెడ్స్ సమస్య తలెత్తుతుంది అని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదట్లో 40 శాతం బెడ్ అక్కుపెన్సి ఉందన్న ఆయన ఇప్పుడు 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. 1935 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అనుమతి ఇచ్చామని, వంద మందికి కరోనా వస్తే 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని అన్నారు. కేవలం 7 నుంచి 8 శాతం ఆస్పత్రిలో చేరుతున్నారని అయన అన్నారు. కరోనా పాజిటివ్ అనగానే…
ఐఏఎస్ ను అంటూ బురిడీ కొట్టించాడు..జాయింట్ పోస్టింగ్ వచ్చిందని నమ్మించాడు..నేమ్ ప్లేట్ రెడీ చేసుకున్నాడు..సైరన్ పెట్టుకున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి ముందుగా డ్రైవర్ ,పీఏను నమ్మించి వేతనాలు పెంచాడు…అలా నమ్మించి ఒక్కటి కాదు రెండు ఏకంగా 80 లక్షలు వసూలు చేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాదితులు స్టేషన్ మెట్లెక్కితే సూడో ఐఏఎస్ అని తేల్చిన ఖాకీలు అసలు బాగోతం బయటపెట్టారు. బర్ల లక్ష్మీనారాయణ, హైదరాబాద్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు..ఈ క్రమంలో తన గ్రామంలో…
కరోనా రాకముందు నిర్లక్ష్యం. కరోనా వచ్చిన తరవాత దారుణం. ఇప్పుడు ఇదే పరిస్థితి… దేశంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు. నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు! కరోనా మొదటి వేవ్ జనాలను ఊచకోత కోసింది. సెకండ్ వేవ్ ఉధృతంగా చొచ్చుకెళ్తోంది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారు జనాలు. కేసులు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం చాలామంది కరోనా వచ్చిన వాళ్ళు…
జనసేనకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తెలంగాణలో జరుగనున్న రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన (గాజుగ్లాసు).. తన కామన్ గుర్తును కోల్పోయింది. గత ఏడాది జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లకు పోటీ చేయని తరుణంలో జనసేన కామన్ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి నిర్ణయంతో కంగుతిన్న జనసేన.. గ్రేటర్ ఎన్నికల్లో బిజేపి తో…
తెలంగాణలో జనసేనకు షాక్ తగిలింది. తెలంగాణలో జరుగనున్న రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన (గాజుగ్లాసు).. తన కామన్ గుర్తును కోల్పోయింది. గత ఏడాది జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లకు పోటీ చేయని తరుణంలో జనసేన కామన్ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి నిర్ణయంతో కంగుతిన్న జనసేన.. గ్రేటర్ ఎన్నికల్లో బిజేపి తో పొత్తు…
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అదే విధంగా తప్పకుండా తామే గెలుస్తామని…
లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా మృతి చెందారు. ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరడం జరిగిందని.. వారు సానుకూలంగా స్పందించారు కానీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. సెకండ్ వేవ్ కరోనా గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని…
తెలంగాణలో ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు.. ఇక, ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. 150 మార్క్ లకు ప్రశ్నలకు 2 గంటల సమయం కేటాయించారు.. సబ్జెక్టులో 60 మార్కులు (సైన్స్ 20 మార్క్స్, సోషల్ 20 మార్క్స్, మాథ్స్ 20 మార్క్స్).. సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు 10 వ తరగతి.. అంత లోపు తరగతుల…