తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా నిరాశ తప్పేలా లేదు.. పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా.. కొన్ని రోజులు ఎన్నికల కోడు.. ఆ తర్వాత జాప్యం.. ఇలా అమలుకు నోచుకోవడం లేదు.. ఈ నెల కూడా పీఆర్సీ అమలు లేనట్టే కనిపిస్తోంది.. ఉద్యోగులకు మే నెల కూడా పాత జీతాలే రానున్నాయని చెబుతున్నారు.. ఏప్రిల్ ఒకటి నుండి కొత్త పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కరోనా వైరస్ విజృంభణ, ఇతర కారణాలతో…
వ్యాక్సినేషన్పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు… కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో.. వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.. కాగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా.. వ్యాక్సినేషన్ నిలిపివేసింది సర్కార్.. టీకాలు వేయడం నిలిచిపోయి కూడా పది రోజులు గడిచింది… అయినా.. తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు.. కానీ, ఇవాళ ఆ తేదీని ఫైనల్ చేసే అవకాశంఉంది… మొదటగా ఫ్రంట్ లైన్…
కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రయివేట్ పాఠశాలలకు సంబంధించిన బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న ఆపత్కాల సహాయాన్ని వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం నాడు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నెలకు సంబంధించిన…
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని..కుంభకర్ణ నిద్ర వీడి రెండు హస్పిటల్స్ ను విజిట్ చేసి.. 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందారని ఎద్దేవా చేశారు. ఎద్దు ఎడిసిన వ్యవసాయం…రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని కెసిఆర్ అన్నారని..మరి ఇప్పుడు తెలంగాణ రైతు ఎడుస్తున్నారు…ఉచిత ఎరువులు ఇస్తానన్న సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రైతుబంధు ఎక్కడికి…
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు….…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి..తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2242 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 19 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోగా.. ఇదే సమయంలో 4693 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,53,277 కు చేరగా.. ఇప్పటి వరకు 5,09,663 కు మంది కోవిడ్ సోకి కోలుకున్నారు. మరోవైపు కోవిడ్తో ఇప్పటి వరకు…
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. ఇక హైదరాబాద్ నగరంలోను కోవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఒక్కో స్మశానంలో రోజుకు 10 కి పైగా మృతదేహాలు వస్తున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. కోవిడ్-నాన్ కోవిడ్ మృతదేహాలను వేర్వేరుగా దహనాలు చేస్తున్నామని చెప్తున్నారు.…
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. మాల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి…నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స…
హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలం ముసి ఒడ్డు సింగారం లో 7 కోట్ల 29 లక్షల 50 వేల అంచనాతో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు మండల ఎంపీపీ విజ్ఞప్తి మేరా నిర్మాణా పనులను పరిశీలించిన టిపిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… చెక్ డ్యామ్ నిర్మాణం రైతుల కోసమా లేక కాంట్రాక్టర్. కొంతమంది పెద్దమనుషుల కమీషన్ల కోసమా అని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత…
మే 13 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈనెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నా, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధం అయ్యింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి సరుకు రవాణా వాహనాలకు…