ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్జీవీ కంపెనీతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కాగా, ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ…
కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది. కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది.…
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని చెప్పింది. ఇక బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని అధికారులు…
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలతో బానిసలుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నివారించడంలో విఫలమైందని చెప్పక తప్పడం లేదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కి రేవంత్ రెడ్డి ఇంటి పైన జరిగిన దాడికి కండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో ఇది ఒక పిరికిపందలు చేసే హీనమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ తన వైట్ ఛాలెంజ్ ఒకే చేశారు. కేటీఆర్ రేవంత్…
కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి వార్తలు వినవాల్సి వస్తుందో అనే ఆందోళనక కలిగించే పరిస్థితి నెలకొంది.. ఇక, ఈ మధ్య వరుసగా హైదరాబాద్లో వెలుగుచూస్తున్న దారుణమైన ఘటనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజేంద్రనగర్ హైదర్గూడలో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారయత్నం చేశాడో గుర్తుతెలియని యువకుడు. బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్న స్థానికులు.. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అతన్ని…
బండి సంజయ్ సంగ్రామ యాత్రలో కొత్త కమలాలు కనిపిస్తున్నాయా? పాత వాసనలు.. పాతకాలపు పోకడలకు చెక్ పెట్టారా? లేక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారా? మారిన పరిణామాలు పార్టీసారథికి.. బీజేపీకి వర్కవుట్ అవుతాయా? సంజయ్ యాత్రలో కనిపిస్తున్న సిత్రాలపై చర్చ! యాత్ర అనే పేరు లేకుండా బీజేపీని ఊహించలేం. రథయాత్ర ద్వారా దేశంలో పార్టీ బలోపేతం కావడంతో.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రను నమ్ముకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆగస్టు 28న…
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలజగడం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడంలేదు.. పరస్పర ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇక, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు… తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, వాదనను పట్టించుకోవద్దంటూ… తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్… కేఆర్ఎంబీకి లేఖ రాశారు. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తన లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించే చోట… టెలీమెట్రీలు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బండి సంజయ్ది పాదయాత్ర కాదు విహారయాత్ర అని ఎద్దేవా చేశారు.. కాళేశ్వరం ఫలితాలను సంజయ్ చూస్తున్నారని.. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పడం లేదన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో సంతోషంగా ఉన్నామని బండి సంజయ్ కి ప్రజలే చెబుతున్నారని.. ఇకనైనా కేసీఆర్పై విమర్శలు మానుకోవాలని…
లిక్కర్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపటి క్రితమే విడుదల చేశారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్.. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వం ఏ- 4 రిటైల్…
పార్టీలలో వర్గపోరు సహజం. సమయం వచ్చినప్పుడు అది ఏ రూపంలో.. ఏ విధంగా బయట పడుతుందో చెప్పలేం. సందర్భాన్ని బట్టి అసంతృప్తి తీవ్రత ఉంటుంది. సమయం కోసం వేచి చూసేవాళ్లు ఛాన్స్ చిక్కితే అస్సలు వదలరు. ప్రస్తుతం ఆలేరు టీఆర్ఎస్లో అదే జరుగుతోందట. ఆలేరు టీఆర్ఎస్లో రచ్చ! యాదాద్రి జిల్లా ఆలేరులో సంస్థాగత ఎన్నికలు టీఆర్ఎస్ అంతర్గత విభేదాలను బయటపెట్టింది. తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్ష ఎంపిక అగ్గి రాజేసింది. ఎమ్మెల్యే గొంగిడి సునీత.. ఆమె భర్త,…