తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి… ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీ హరి, బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, తక్కళ్ల పల్లి…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,018 శాంపిల్స్ పరీక్షించగా… 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 153 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,187కు చేరుకోగా… రికవరీ కేసులు 6,68,564కు పెరిగాయి.. ఇక, మృతుల…
మధిర టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు ఇటీవలే కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. కౌన్సిలర్ మల్లాది వాసు వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్న సామాజిక వర్గాన్ని కుట్రలు, కుతంత్రాల వైపు చంద్రబాబు నడిపిస్తున్నారు. Read: 2021 బెస్ట్ యాప్లు ఇవే… మల్లాది వాసు లాంటి వారిని వివిధ పార్టీల్లో…
గత కొన్ని రోజులు ఏపీలో సినిమా టికెట్ల ధరల చుట్టూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడం మాత్రమే కాకుండా బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అలాగే టికెట్లు కూడా ఆన్లైన్ లో విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఇది ఏపీలో కాదు.. తెలంగాణలో. తాజాగా…
తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగుకు 25 పైసలు, ఎక్స్ప్రెస్లు, ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ సీఎం కేసీఆర్.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే… కచ్చితంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుకే.. సీఎం కేసీఆర్ మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే… ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి… ట్విట్టర్ వేదికగా…
వరిధాన్యం, బియ్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరిధాన్యం కొనుగోలుపై లోకసభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. 2018-19 లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం,…
ఢిల్లీః జీఎస్టీ వసూళ్ల పై… కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. నవంబర్ మాసం- 2021 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఇవాళ వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఏకంగా… రూ.1,31,526 కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. సీజీఎస్టీ రూ. 23,978 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో మొత్తం రూ. 9,606 కోట్లు వసూలు అయినట్లు ప్రకటన…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచి… ప్రజల నడ్డి విరస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలన చేతకాకపోతే… రాజీనామా చేయండి సారూ అంటూ చురకలు అంటించారు. వైఎస్ పాలనలో మున్సిపల్ పన్ను, కరెంట్ బిల్లులు, బస్ ఛార్జీలు ఏవీ కూడా అణాపైసా పెంచింది లేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ పరిపాలనలో విద్యుత్తు, ఆర్టీసీ సంస్థలను నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాలను పూడ్చు కొనేందుకు ఇప్పుడు బస్…
హైదరాబాద్ నలువైపులా నిర్మించే మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ దినోత్సవంగా…