తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదని కేసీఆర్ను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తుంటే తెలంగాణలో ఎందుకు తగ్గించరని విజయశాంతి నిలదీశారు. హుజురాబాద్లో ఓటమి చెందడంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు. Read…
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. అందులోభాగంగా కేంద్రంపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రగతి భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు.. ఇది నీ చేతకాని తనం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. ఇక, కేంద్రం వరి…
తెలంగాణ ప్రభుత్వం పథకాలకు ఖర్చు చేసే ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తుందంటూ పలు సందర్భాల్లో బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు.. ఒక, గొల్ల కురుమల కోసం ప్రభుత్వం అందిస్తున్న గొర్రెల పంపిణీ పథకంలోనూ కేంద్రం నిధులున్నాయని విమర్శించింది బీజేపీ.. అయితే, గొర్రెల పంపిణీ పథకంలో ఒక్క పైసా కేంద్రం వాటా ఉన్నా సీఎం పదవీకి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన…
తన ఫాం హౌస్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పదే పదే తన ఫాం హౌజ్ను దున్నుతా అంటున్నావ్.. నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్వా? అని బండి సంజయ్ను ప్రశ్నించారు. చట్టం ప్రకారం కొన్న తన ఫాం హౌజ్ ముందు అడుగు పెడితే ఆరు ముక్కలవుతావని హెచ్చరించారు. అయినా తనది ఫాం హౌస్ కాదని.. ఫార్మర్ హౌస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను వ్యవసాయం చేసే కుటుంబంలో…
మరోసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. వరుసగా రెండోరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో నిజాలు మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన మాట్లాడేవారిపై దేశద్రోహిగా ముద్ర వేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహి.. బిల్లులకు పార్లమెంట్లో సహాయం కోరినప్పుడు కేసీఆర్ దేశద్రోహికాడు..! రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపినప్పుడు కేసీఆర్ దేశద్రోహి కాదు..! కానీ, ఎవరు గట్టిగా మాట్లాడినా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశద్రోహి అవుతారని వ్యాఖ్యానించారు…
ఏడేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం ఒరిగింది..? ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? అంటూ నిలదీశారు తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి… నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాడు 2014లో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉంటే.. దేశంలో పెట్రోలు రూ.77, డీజిల్ ధర రూ.68కి లభించింది.. ఇప్పుడు క్రూడాయిల్ ధర 83 ఉన్నప్పుడు పెట్రోల్ ధర రూ.115, డీజిల్ ధర రూ.107గా ఉందని గుర్తుచేశారు.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్రావు మరోసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేవారు.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు.. అయితే, ఇవాళ సీఎం ఎవరిని టార్గెట్ చేస్తారు..? ఎవరిపై మాటల దాడికి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. ఆదివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీరియస్గా స్పందించారు.. అంతేకాదు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. ఇక, బీజేపీ రాష్ట్ర…
కరోనా లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు నటుడు సోనూసూద్ సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో కోవిడ్ వారియర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా… మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతడిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించారని…
తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని మండిపడ్డారు. ఆదివారం రాత్రి గంటసేపు ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్ అబద్దాలే మాట్లాడారని.. ఈ అబద్దాలు చెప్పేందుకే ప్లీనరీలు, బహిరంగసభలు, కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని.. రైతులను ఆగమాగం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎక్కడ అవుతుందో…
కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతోనే సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా కేసీఆర్కు ఎప్పుడు కోపం వచ్చినా బీజేపీని తిట్టడం ఆయనకు ఫ్యాషన్ అయిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వరి కొనుగోలు చేయబోమని చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయం అని చెప్పిందని రఘునందన్రావు గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా…