తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచి… ప్రజల నడ్డి విరస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలన చేతకాకపోతే… రాజీనామా చేయండి సారూ అంటూ చురకలు అంటించారు. వైఎస్ పాలనలో మున్సిపల్ పన్ను, కరెంట్ బిల్లులు, బస్ ఛార్జీలు ఏవీ కూడా అణాపైసా పెంచింది లేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ పరిపాలనలో విద్యుత్తు, ఆర్టీసీ సంస్థలను నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.
నష్టాలను పూడ్చు కొనేందుకు ఇప్పుడు బస్ ఛార్జీలు, కరెంట్ బిల్లుల భారం పెంచేందుకు రెడీ అయ్యారని నిప్పులు చెరిగారు షర్మిల. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే… పిచ్చోడి చేతిలో రాయిలా… రేట్లను పెంచి సామాన్యుడిపై పన్నుల భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ప్రజల నడ్డి విరిచేందుకు తయారయ్యారన్నారు. అప్పులు, పన్నులు పెరిగిపోతుంటే.. ఇంకా మీరెందుకు సారు..? రాజీనామా చేయండని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.