హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. తొలుత గన్పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్.. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో ఈటల రాజేందర్తో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఏడుసార్లు ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆరుసార్లు టీఆర్ఎస్, ఒకసారి బీజేపీ…
కేసీఆర్ ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడిమసై పోతాడని మాజీ మంత్రి మోత్కు పల్లి నర్సింలు వార్నింగ్ ఇచ్చారు. నిన్న బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని… దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని మండిపడ్డారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? బీజేపీ నేతలకు సిగ్గు ఉందా? అని నిలదీశారు మోత్కుపల్లి. కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? బీజేపీ వల్లే కులవ్యవస్థ…
తెలంగాణలో టి-డయాగ్నోస్టిక్స్ పథకంలో భాగంగా ఇప్పటికే 20 జిల్లాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తాజాగా మరో 13 చోట్ల నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా మరో 8 వైరాలజీ ల్యాబ్లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారు రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్లను జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్…
బీజేపీలో ఈటెల స్థానం ఏంటి? సముచిత గౌరవం దక్కుతుందా? సీనియారిటీకి తగ్గ గుర్తింపు లభిస్తుందా? ఇప్పుడు ఇలాంటి చర్చే మొదలైంది. సీనియారిటీకి తగ్గట్టే ఈటలకు పదవీ దక్కుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ ఈటెలకోసం బీజేపీ సిద్ధం చేస్తున్న ఆ కుర్చీ ఏంటి? ఇప్పటికే ఆ కుర్చీలో కూర్చున్నవారి పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ నుంచి ఎంత వేగంగా బయటకొచ్చారో.. అంతే వేగంగా బీజేపీలో చేరిపోయారు ఈటల రాజేందర్. అధికార పార్టీని ఢీ కొట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని…
భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకుంది. ఆ బాధ్యతలను ఇకపై డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి పోర్టల్లో లాగిన్ సౌకర్యాన్ని కల్పించింది. ఇకపై రిజిస్ట్రేషన్ వ్యవహారాల బాధ్యతలు కూడా వీళ్లే చూడనున్నారు. ధరణి పోర్టల్ను ప్రారంభించి ఏడాది పూర్తికావడంతో.. వెబ్ సైట్ లో పలు మార్పులు చేర్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు చూసిన తహసీల్దార్లకు ఆ భారం తప్పించింది. డిప్యూటీ…
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలామంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. మరికొందరు కుటుంబసభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read Also: మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ ఈ మేరకు…
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్రావుకు అదనపు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలను కూడా హరీష్రావుకు అప్పగించనున్నారు.. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయానికి రాగా.. కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.. కాగా, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్పై ఆరోపణలు రావడంతో.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కేసీఆర్ దగ్గరే ఉంచుకున్నారు.. కరోనా సమయంలో.. సమీక్షలు…
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… కానీ ఈరోజు పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. ఒక్క కరోనా బాధితుడు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 168 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,823 కు చేరగా… రికవరీ కేసులు…
కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో 2018లో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడాడో కిరాతకుడు.. అయితే, ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టులు.. నిందితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ఇక, 2018లో ఈ కేసు వెలుగు చూడగా..…