గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. హిమాయత్ సాగర్ 2 ఫీట్ల మేరా 4 గేట్లు, గండిపేట 4 ఫీట్ల మేరా 6 గేట్లు ఎత్తి జల మండలి అధికారులు నీటిని విడుదల చేసారు. దీంతో.. వికారాబాద్, శంకర్పల్లి, మోకిలా, పరిగి, షాబాద్, షాద్నగర్ నుండి జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్…
భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం…
జూలై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే.. అయితే.. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. దీంతో మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా…
పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయనున్నారు. వచ్చే నెల ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాతపరీక్ష జరగనుండటంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే.. అభ్యర్థులు వాటిలో తమ వేలిముద్రలను నమోదుచేయాల్సి ఉంటుంది. కాగా.. 554 ఎస్సై పోస్టుల కోసం జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 పరీక్ష కేంద్రాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 35 పట్టణాల్లో…
ప్రధాని మోడీ తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈనేపథ్యంలో.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రామగుండంలోని 100మెగావాట్ల ప్రాజెక్టుతో పాటు కేరళలోని కాయంకుళం 92మెగావాట్ల ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో నేడు దేశానికి అంకితం చేయనున్నారు. వర్చువల్ గా జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీ నుంచి వర్చువల్ మోడ్ ద్వారా ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ…
హైదరాబాద్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా రికవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 241మంది వున్నారు. తెలంగాణ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 5వ స్థానంలో వుంది. తెలంగాణలో ఇప్పటివరకూ 62 కేసులు నమోదయ్యాయి. రికవరీ అయినవారు 10 మంది. ఇదిలా వుంటే శంషాబాద్లో దిగిన ఓ బాలుడికి ఒమిక్రాన్ సోకింది. దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులకు సోకింది వైరస్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని…