చారిత్రాత్మక మక్కా మసీదులో చేపట్టిన మరమ్మతులు, పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రంజాన్లోపు పనులు పూర్తి చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ హెరిటేజ్ శాఖను కోరింది. 17వ శతాబ్దపు మసీదు మరమ్మతు పనులను 2017లో అధికారులు ప్రారంభించారు. తొలుత 18 నెలల గడువును అధికారులు నిర్దేశించగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 8 కోట్లు మంజూరు చేసింది. వారసత్వ కట్టడాల…