ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) రైతు బంధు పథకం కింద డబ్బు పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో 2023లో కూడా 2018 పునరావృతం కాగలదని ఆశించింది. ఇది ఎన్నికల ఫలితాలను నడిపిస్తుందని.. భారీగా ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేసిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.