నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు. సంజీవ్ ముఖియా చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. సీబీఐ కూడా అతని కోసం వెతుకుతోంది.
పశ్చిమ బెంగాల్లో జరిగిన కోట్లాది రూపాయల స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు అధికారిని వెంటనే మార్చాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
శ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్లో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఆమెకు చెందిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఆ కార్లలో పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇప్పటికే ఈ స్కాంలో ఆయన అరెస్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీపై ఈడీ విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఆ విషయంపై స్పందించని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు.
టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కానీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఒడిశా భువనేశ్వర్లోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.
పశ్చిమబెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్థ ఛటర్జీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు కూడబెట్టిన తీరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటకు తీస్తూ వస్తోంది. తాజాగా ఈడీ విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్ను కొన్నట్లు ఈడీ విచారణలో తేలింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది.పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది.