NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ సూత్రధారి అరెస్ట్.. చాలా కాలంగా పరారీలో నిందితుడు..
- నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా
- చాలా కాలంగా పరారీలో ఉన్న సంజీవ్ ముఖియా
- పేపర్ లీక్ కేసులు ప్రధాన నిందితుడిగా సంజీవ్
- ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు. సంజీవ్ ముఖియా చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. సీబీఐ కూడా అతని కోసం వెతుకుతోంది.
READ MORE: Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎన్ఎస్ఈ, ఎల్ఐసీ బాసట.. పరహారం ప్రకటన
Also Read
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
ఇటీవల, బీహార్ పోలీసు ప్రధాన కార్యాలయం సంజీవ్ ముఖియాను పట్టించిన వారికి రూ. 3 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ రివార్డును 2025 ఏప్రిల్ 10న ప్రకటించారు. అతని గురించి ఏమైనా తెలిస్తే సమాచారం ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీకేజీతో పాటు, బీహార్లో టీచర్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష వంటి అనేక పేపర్ లీక్ కేసుల్లో సంజీవ్ ముఖియా ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
READ MORE: Jammu Kashmir: జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా ఆగ్ర ఉగ్రవాది ఖతం..
దానాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సగుణ మోడ్లో ఉన్న ఒక అపార్ట్మెంట్కు సంజీవ్ ముఖియా వస్తున్నాడని బీహార్ ఆర్థిక నేరాల విభాగానికి రహస్య సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా ఆ బృందం దాడికి ప్రణాళిక వేసింది. గురువారం రాత్రి ఆపరేషన్ ప్రారంభించి సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో నిందితుడు తప్పించుకోకుండా ఉండటానికి దానాపూర్ పోలీసుల సహాయంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
READ MORE: Pahalgam Terror Attack: పహల్గామ్పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం.. తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా
గత ఏడాది నీట్ పేపర్ లీక్..
నీట్ పేపర్ లీక్ కేసు మే 5, 2024న పాట్నా పోలీసులు అక్రమాలను వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. మొదట్లో బీహార్ ఆర్థిక నేరాల విభాగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. కానీ తరువాత 23 జూన్ 2024న కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ తన దర్యాప్తులో సంజీవ్ ముఖియాను ప్రధాన నిందితుడిగా పరిగణించింది. కానీ.. నిందితుడు మాత్రం చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. తాజాగా అతని అరెస్టుతో రాష్ట్రంలో పేపర్ లీక్ కేసులోని అనేక అంశాలు బయటపడవచ్చు.
తాజావార్తలు
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!