NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ సూత్రధారి అరెస్ట్.. చాలా కాలంగా పరారీలో నిందితుడు..
- నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా
- చాలా కాలంగా పరారీలో ఉన్న సంజీవ్ ముఖియా
- పేపర్ లీక్ కేసులు ప్రధాన నిందితుడిగా సంజీవ్
- ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు. సంజీవ్ ముఖియా చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. సీబీఐ కూడా అతని కోసం వెతుకుతోంది.
READ MORE: Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎన్ఎస్ఈ, ఎల్ఐసీ బాసట.. పరహారం ప్రకటన
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఇటీవల, బీహార్ పోలీసు ప్రధాన కార్యాలయం సంజీవ్ ముఖియాను పట్టించిన వారికి రూ. 3 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ రివార్డును 2025 ఏప్రిల్ 10న ప్రకటించారు. అతని గురించి ఏమైనా తెలిస్తే సమాచారం ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీకేజీతో పాటు, బీహార్లో టీచర్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష వంటి అనేక పేపర్ లీక్ కేసుల్లో సంజీవ్ ముఖియా ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
READ MORE: Jammu Kashmir: జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా ఆగ్ర ఉగ్రవాది ఖతం..
దానాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సగుణ మోడ్లో ఉన్న ఒక అపార్ట్మెంట్కు సంజీవ్ ముఖియా వస్తున్నాడని బీహార్ ఆర్థిక నేరాల విభాగానికి రహస్య సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా ఆ బృందం దాడికి ప్రణాళిక వేసింది. గురువారం రాత్రి ఆపరేషన్ ప్రారంభించి సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో నిందితుడు తప్పించుకోకుండా ఉండటానికి దానాపూర్ పోలీసుల సహాయంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
READ MORE: Pahalgam Terror Attack: పహల్గామ్పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం.. తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా
గత ఏడాది నీట్ పేపర్ లీక్..
నీట్ పేపర్ లీక్ కేసు మే 5, 2024న పాట్నా పోలీసులు అక్రమాలను వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. మొదట్లో బీహార్ ఆర్థిక నేరాల విభాగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. కానీ తరువాత 23 జూన్ 2024న కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ తన దర్యాప్తులో సంజీవ్ ముఖియాను ప్రధాన నిందితుడిగా పరిగణించింది. కానీ.. నిందితుడు మాత్రం చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. తాజాగా అతని అరెస్టుతో రాష్ట్రంలో పేపర్ లీక్ కేసులోని అనేక అంశాలు బయటపడవచ్చు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!