స్కూల్ లో వేధింపులు తట్టుకోలేక సైన్స్ టీచర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,అస్సాం రాష్ట్రానికి చెందిన మార్కస్ బాగే (33) తండ్రి పియుష్ బాగే అనే అతనికి ఎనిమిది సంవత్సరాల క్రితం జూలీ లోవాని(29) తో ప్రేమ వివాహం జరిగింది కాగా వీరు జీవనోపాధి కోసం అస్సాం రాష్ట్రం నుండి హైదరాబాద్ కు వలస వచ్చి అబ్దుల్లామెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో…
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లిదండ్రులు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది.
Teacher Harassment: హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థిపై శారీరక దాడి చేసి అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కలిగించినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు, ఓ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, ఆశించిన…
కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కంట తడి పెట్టుకున్నారు. బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షన్మోహన్ ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లే కలెక్టర్ అయ్యానని భావోద్వేగానికి గురయ్యారు.
విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
Teacher Harassment: రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని బనీ పార్క్లో ఉన్న మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని జుట్టు పట్టుకుని కిందకు తోసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే విద్యాశాఖ ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 3న ఈ ఘటన జరిగింది. ఘటనలో ఆ అమ్మాయి పేరు…