Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Teachers Harassing Students In Andhra Pradesh

Andhra Pradesh: వార్డెన్‌, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి కీచక పర్వాలు.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

Published Date :September 18, 2024 , 12:07 pm
By Mahesh Jakki
Andhra Pradesh: వార్డెన్‌, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి కీచక పర్వాలు.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh: విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో నా పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తి చేయడంతో పాటు ఇంటికి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరించాడు. విషయం బయటకి రావడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. డిప్యూటీ డీఈవో, ఎంఈఓ పాఠశాలలో విచారణ చేపట్టారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల పైనే కాకుండా సహచర ఉపాధ్యాయులపై కూడా ఉపాధ్యాయుడు రవి అసభ్య ప్రవర్తన విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆయనపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read Also: Attack on GirlFriend: పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి

మరో ఘటనలో ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినులపై వార్డెన్ భర్త శశికుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు హాస్టల్‌లో చోటు చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. హాస్టల్ లో పొందుతున్న దాదాపు 45 మంది విద్యార్థినిలు హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఏలూరు బాలికల హాస్టల్ లో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్ శశి కుమార్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో  ఎర్రగుంటపల్లి హాస్టల్ వార్డెన్‌గా బొమ్మిరెడ్డిపల్లి శశి కుమార్ పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ హాస్టల్లో తన భార్య ఫణిశ్రీని  శశి కుమార్ మ్యాట్రీన్ గా ఉంచాడు. భార్య పేరు చెప్పి హాస్టల్లో ప్రవేశించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు శశి కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేయగా.. విచారణలో మరో ఐదుగురు బాధితులు పిర్యాదు చేసినట్టు సమాచారం..

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు‌. ఈ మేరకు గంగవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ తాను స్కూల్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హాస్టల్ గదుల్లోకి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం. ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ అసభ్యకరంగా మాట్లాడాడని, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కీచక ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్ట సింహాచలం సస్పెండ్ చేశారు. దీనిపై గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో గత కొంతకాలంగా ఐదుగురు ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలపై రామకృష్ణ లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో గంగవరం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కు పంపనున్నారు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడటాన్ని పలువురు గిరిజన సంఘం నాయకులు మండిపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Crime News
  • Eluru Warden Incident
  • physical harassment
  • Students

తాజావార్తలు

  • Ravichandran Ashwin: “4 ఓవర్లు వేయకపోతే రూ.2 కోట్లు కట్ చేయండి”.. ఆస్ట్రేలియా ప్లేయర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..

  • Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!

  • Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట

  • Indian Rupee Falls: ఒక్క రోజులో భారీ పతనం.. రూపాయి పడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..

  • Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions