టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేస్తే చంద్రబాబు డొంక కదులుతుందనే భయంతోనే లోకేష్ వైజాగ్ వచ్చారన్నారు. టీడీపీ హయాంలో చేసిన గంజాయి సాగు లావాదేవీలు, అక్రమాలు బయట పడతాయని భయంతో విశాఖ వచ్చారు అని విమర్శించారు అమర్నాథ్. 41 నోటీసు ఇస్తే ఎందుకు ఉలికి పాటు. రాజ్యాంగంలో వున్న పెద్దలపై తప్పుడు మాటలు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాగుబోతు కారు నడిపితే, పిచ్చోడి…
ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయ్యన్నపాత్రుడు మొదటిసారి మంత్రి అయ్యేటప్పటికి జగన్ పాలుతాగుతున్నాడు.అయ్యన్నపాత్రుడు ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి పోలీసులను పంపిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ పోలీసులు మోహరింపు, నిర్బంధం చూస్తే నర్సీపట్నంలో ఉన్నామా ఉక్రెయిన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు లోకేష్. అయ్యన్నపాత్రుడు పై 9 కేసులు పెట్టారు….అందులో నిర్భయ చట్టం కింద ఉండటం దారుణం. ఇప్పటి వరకు…
రాజమండ్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు, ఆశావర్కర్ల ఆందోళనలపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ పేదల పక్షపాతి వారి ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై ఈర్ష్యతో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు ఏడు వేల రూపాయల జీతం వచ్చేది. సీఎం…
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు నెలల నుంచి లేఅవుట్ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుందని నేతలు చెబుతున్నారు. వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లేఅవుట్ స్థలాలకు నాలుగు నెలల నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఈ ఏడాది అక్టోబర్…
అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. కేంద్ర హోం శాఖ సబ్ కమిటీ సమావేశ ఎజెండా నుంచి ప్రత్యేక హోదా వంటి అంశాల తొలగింపు పై స్టేట్ మెంట్ విడుదల చేయాలని కోరారు జీవీఎల్. ఎజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయటానికి మరో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రత్యేక హోదా అంశాన్ని మొదట ప్రస్తావించింది మేమే అన్నారు జీవీఎల్. అప్పుడు…
ఆయనో మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో మంత్రిగా కొన్నాళ్లున్నారు. అయినప్పటికీ ఏ పార్టీలోనూ పట్టుమని పదేళ్లపాటు కొనసాగలేని పరిస్థితి. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలా.. రిటైర్ అవ్వాలా అన్నట్టుగా ఉన్న పొలిటికల్ కెరియర్కు అనుచరుడి కామెంట్స్ తలనొప్పి తెచ్చాయా? గండం నుంచి గట్టెక్కేందుకు ఎవరి మద్దతు కూడగట్టాలో అర్థం కావడం లేదా? ఎవరా నాయకుడు? ఏమా కథ? స్థిరమైన ఆలోచన లేదని పాలేటిపై విమర్శపాలేటి రామారావు. చీరాల మాజీ ఎమ్మెల్యే. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు…
వారిద్దరూ మిత్రులు కాదు. అలా అని శత్రువులు కారు. ఒకరు అధికారపార్టీ అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే. ఇంకొకరు టీడీపీ నేత. అకస్మాతుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దెప్పిపొడుపు మాటలతో తమలోని కళను బయటపెడుతున్నారు. ఆ గిల్లికజ్జాల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషణతూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా వాడీవేడిగా మారిపోయాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది.…
టీడీపీ, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. గుడివాడ ప్రజలకు సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలో నేను నేర్పుతా అని సోమువీర్రాజు అంటున్నాడు. గుడివాడ ప్రజలకు సంక్రాంతి ఎలా చేసుకోవాలో తెలియదా? టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకొని..చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి సోము వీర్రాజు అని మండిపడ్డారు. గోవా కల్చర్ అంటున్నారు..గోవాలో ఉంది బీజేపీ ప్రభుత్వమే. గోవాలో ఎందుకు కాసినో కల్చర్ ను బ్యాన్ చేయడం లేదు. చంద్రబాబు శిష్యులు బీజేపీలో ఉన్నారు.…
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పీఆర్సీ అంశం కంటే గుడివాడ క్యాసినో కథ.. రంజుగా మారింది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. రోజుకో ట్విస్ట్ ఇందులో బయటపడుతోంది. తాజాగా టీడీపీ మహిళా నేత అనిత తీవ్రంగా స్పందించారు. ఏపీలో గోవా కల్చర్ తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి వైసీపీ నేతలు మచ్చ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయంపై హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా కనీసం నోరు కూడా విప్పడం లేదని అనిత…