Top 5 Most Impactful Cars Launched in India in 2025: 2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కీలకమైన కొత్త కార్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది కంపెనీలు పూర్తిగా కొత్త మోడళ్లను తీసుకురావడమే కాకుండా, పాత పేర్లను మళ్లీ మార్కెట్లోకి తెచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మెరుగైన పెట్రోల్, డీజిల్ కార్ల వరకు అన్ని విభాగాలను ఇవి కవర్ చేశాయి. వాటిలో ఈ ఏడాది ప్రభావం చూపిన ఐదు ముఖ్యమైన కార్ల గురించి తెలుసుకుందాం..
Tata Sierra: ఇటీవల ఏళ్లలో ఎక్కువగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. టాటా 1990లో తీసుకువచ్చిన ఈ ఎస్యూవీని, ఇప్పుడు సరికొత్తగా తీసుకువస్తోంది. డిజైన్, టెక్నాలజీని మేళవింపు చేసి ఈ ఎస్యూవీని టాటా తీసుకువస్తోంది. నవంబర్ 25,2025న గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే, ఈ కారును టాటా అన్విల్ చేసింది. టాటా ఇతర కార్లతో పోలిస్తే డిజైన్, డ్యాష్ బోర్టు భిన్నంగా ఉంది. టాటా కార్లలో తొలిసారిగా సియెర్రాలోనే 3-స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్…