జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఈ నెల 18న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. బుధవారం హైదరాబాద్లో తారకరత్న పుట్టిన రోజు నాడు, ఆయన…