హోం మంత్రి తానేటి వనితపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా తానేటి వనిత రాజీనామా చేయాలన్నారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తూ ఉన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలి. మీ చేతగానిపాలన అసమర్ధ పాలన వల్ల…
ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఇలాంటి ఘటనలతో బీహారును ఏపీ మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు లోకేష్. గత నాలుగు రోజులుగా…
ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా? బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము…
తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లతో ప్రభుత్వం సంప్రదింపులకు దిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కె.భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర లతో భేటీ అయ్యారు ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు. ఎన్ సిడిసి సర్వేను ఆశా వర్కర్లతో చేయించడం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే నిలిపివేయాలని కోరారు ఆశా వర్కర్ల సంఘం. గౌరవ వేతనం రూ. 10 వేల నుంచి రూ. 15…
చంద్రబాబులా కుట్రలు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదన్నారు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. ప్రజా బలంతో జగన్ గెలిచారన్నారు. విశాఖ తగరపువలస రెండో రోజు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో పెరుగుతున్న అదరణ చూసి ఓర్వలేక తన తొత్తు అయిన పట్టాభితో అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారని విమర్శించారు తానేటి వనిత. రాష్ట్రం లో అలజడి,శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని ప్రజాదరణ కోల్పోతున్న తెలుగుదేశం…
నారా లోకేష్ పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. తాజాగా ఎన్టీవీ తో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… లోకేష్ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాడు..రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించకపోతే పరామర్శ కి వెళ్ళాలి గాని స్పందించిన తరువాత కూడా పరామర్శ దేనికి. ఘటన జరిగిన ఎన్నో నెలలకి పరామర్శ ఏంటి అని ప్రశ్నించారు. దిశా చట్టం తీసుకు రావాలని సీఎం ని ఎవరు అడగలేదు. ఆడ బిడ్డల…
రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష. ముఖ్యమంత్రి జగన్ దయతోను, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదు. కరోనా సమయంలో…