ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు ప్లాన్ చేస్తుండగా.. మరోవైపు.. పంజ్షీర్లో తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది… అయితే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తానే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ కూడా ఆఫ్ఘన్ను వీడారు.. అధ్యక్షుడు లేని సమయంలో నిబంధనల ప్రకారం తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకుని పంజ్షీర్ వెళ్లిన ఆయన.. తాలిబన్లపై పోరాటానికి పంజ్షీర్ ప్రజలు, అక్కడి ప్రజలు, ఆప్ఘన్ సైన్యం…
దేశంలో ఈ ఏడాది కాలంలో పెట్రోల్ ధరలు రూ.20 మేర పెరిగాయి. దీంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ తోపాటుగా వంటగ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.200 వరకు గ్యాస్ ధరలు పెరిగాయి. అయితే, దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధమే అని, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను అక్రమించుకోవడంతో ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు కర్ణాటక ఎమ్మెల్యే. హుబ్లీ -ధార్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పెట్రోల్ ధరల పెరుగుదలపై…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పరిపాలన మొదలైంది. ఈరోజు నుంచి ఆ దేశంలో తాలిబన్ల పరిపాలన మొదలైంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లినప్పటికీ, పంజ్షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. అయితే, తాలిబన్లను పంజ్షీర్ దళాలు ఎదుర్కొంటున్నాయి. పంజ్షీర్ను తమ ఆధీనంలోకి తీసుకున్నామని తాలిబన్లు చెబుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై పంజ్షీర్ నేతలు స్పందిచారు. పంజ్షీర్ తమ ఆధీనంలోనే ఉందని, పరిస్థితులు కఠినంగా ఉన్నాయనీ,…
ప్రపంచం చూపు మొత్తం ఇప్పుడు షంజ్ షీర్ పైనే ఉంది. అప్ఘన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తాలిబన్లతో పోరాడాలేక దేశం విడిపోడి పారిపోయిన సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే అప్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకొని తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాలిబన్ల పాలనను ఒప్పుకునేది లేదంటూ అక్కడి ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వస్తున్నాయి. ముఖ్యంగా సింహాలగడ్డగా పేరొందిన షంజ్ షీర్ ప్రాంతవాసులు తాలిబన్లతో గట్టిగా పోరాడుతున్నారు. ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా…
కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే…
తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో కొలువుదీరినట్టు వార్తలు వస్తున్నాయి. మహిళలను గౌరవిస్తామని ఇప్పటికే తాలిబన్లు అనేకమార్లు ప్రకటించారు. వాళ్లు చెబుతున్న మాటలకు, చేతలకు ఏ మాత్రం పొందికలేదని మరోమారు స్పష్టం అయింది. ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్లో నిన్నటి రోజున 50 మంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రభుత్వంలో అవకాశం కల్పించాలని, మహిళలు లేకుండా ప్రభుత్వం ముందుకు సాగలేదని పేర్కొన్నారు. అలా మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసలు చేస్తుండగా తాలిబన్లు వచ్చి మహిళల…
ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకున్నా, పంజ్షీర్ మాత్రం తాలిబన్లకు దక్కకుండా ఉండిపోయింది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తాలిబన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు పంజ్షీర్ దళాలు. తాలిబన్లు దాడులు చేసిన ప్రతిసారి పంజ్షీర్ సైన్యం ఎదురుదాడి చేసి తాలిబన్లను మట్టుబెడుతున్నది. పెద్దసంఖ్యలో తాలిబన్లు పంజ్షీర్ చేతిలో హతం అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, పంజ్షీర్ దళాలపై పోరాటం చేసుందుకు అల్ఖైదా సాయం తీసుకున్నారు తాలిబన్లు.…
తాలిబన్లు అంతే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.. తాజాగా, జమ్మూ కశ్మీర్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు తాలిబన్లు.. మొదట్లో కశ్మీర్.. భారత్-పాకిస్థాన్ అంతర్గత విషయమని.. అది ఆ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మాట మార్చారు.. ముస్లింలుగా కశ్మీర్, భారత్ సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు మాకు ఉంది అంటూ ప్రకటించారు.. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్..…
ఆఫ్ఘనిస్థాన్లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది.…