Suryanagari Express derails in Rajasthan: ముంబై-జోధ్పూర్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని పాలి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై బాంద్రా టెర్మినల్ నుంచి బయలుదేరిని సూర్యనగరి ఎక్స్ప్రెస్ జోధ్ పూర్ డివిజన్ లోని రాజ్ కియావాస్ -బోమద్ర సెక్షన్ మద్య తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి.