సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మిస్తున్న సినిమా ‘జెట్టి’. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తొలిచిత్రం ఇది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని సముద్ర తీర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న వారిపై దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ లోకేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా…