Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్కు ప్రధాన కారణాలు…