PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైందని పేర్కొన్నారు. అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా సంభవించిందని గుర్తు చేశారు. అమెరికా, ఇరాన్లు యుద్ధానికి ముగింపు పలికే అవగాహనకు రావడం సానుకూల పరిణామమని అభివర్ణించారు.
అమెరికా-ఇరాన్ మధ్య గత మూడు నెలలుగా కొనసాగిన ఘర్షణ అంతర్జాతీయ ఆందోళనలకు కారణమైంది. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఈ సంక్షోభం ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా ఇరు దేశాలు శాంతి ప్రతిపాదనపై అంగీకారానికి రావడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
భారత్ ఎప్పటి నుంచో హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగాలని, వివాదాలను సంభాషణలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే పరిష్కరించాలని చెబుతోంది. గత మూడు నెలలుగా ప్రధాని మోడీ పలువురు ప్రపంచ నేతలతో మాట్లాడి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. శాంతి ఒప్పందం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై వెంటనే కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 83.89 డాలర్లకు పడిపోయాయి. అంతేకాకుండా భారత స్టాక్ మార్కెట్లలో కూడా భారీ ఉత్సాహం కనిపించింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా లాభపడి ప్రారంభమవగా, నిఫ్టీ కూడా గణనీయంగా పెరిగింది. రూపాయి విలువ కూడా అమెరికన్ డాలర్తో పోలిస్తే బలపడింది. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం పశ్చిమాసియాలో స్థిరత్వం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కీలక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!