Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
- యూరియా, డీఏపీతో భారీ సరుకు భారతదేశానికి
- యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్
- దేశంలో ఎరువుల నిల్వలు పుష్కలంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త వెల్లడించింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా భారతదేశానికి ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశానికి ఎరువులు, ముడి పదార్థాలను తీసుకొస్తున్న 20 నౌకల్లో ఇప్పటికే 15 నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు తెలిపింది.
యూరియా, డీఏపీతో భారీ సరుకు భారతదేశానికి
మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, సురక్షితంగా ప్రయాణించిన 15 నౌకల్లో 8 నౌకలు- 3.32 లక్షల టన్నుల యూరియా, 4 నౌకలు- 2.57 లక్షల టన్నుల డీఏపీ (DAP), 3 నౌకలు- 1.11 లక్షల టన్నుల సల్ఫర్ తీసుకువస్తున్నాయి. ఈ సరుకు అంతా నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే భారత ఓడరేవులకు చేరుకుంటోందని అధికారులు వెల్లడించారు.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
- Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
మరో ఐదు నౌకలు కూడా రానున్నాయి
ఇంకా ఐదు నౌకలు భారతదేశానికి చేరనున్నాయని కేంద్రం తెలిపింది. వాటిలో ఒక నౌక 0.25 లక్షల టన్నుల అమ్మోనియా, మరో నౌక 0.45 లక్షల టన్నుల యూరియాను తీసుకువస్తోంది. అదనంగా మరో రెండు యూరియా నౌకలు, ఒక సల్ఫర్ నౌకలో లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకారమే భారతదేశానికి చేరుతాయని అధికారులు పేర్కొన్నారు.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం లేదు
హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాపై మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రభావం చూపినప్పటికీ, ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయం, నిరంతర పర్యవేక్షణ వల్ల ఎరువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. అలాగే దౌత్యపరమైన చర్చల ద్వారా కొత్త సరఫరా వనరులను కూడా సమకూర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పలు దేశాల నుంచి యూరియా దిగుమతులు
భారతదేశం యూరియా సరఫరా కోసం పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో:
ఒమన్
మలేషియా
వియత్నాం
జార్జియా
నైజీరియా
రష్యా
ఫిన్లాండ్
ఈజిప్ట్
అల్జీరియా
టర్కీ
నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయి. అలాగే డీఏపీ, ఎన్పీకే ఎరువుల కోసం రష్యా, మొరాకో, ఈజిప్ట్, అమెరికా, జోర్డాన్, దక్షిణ కొరియా, ట్యునీషియా, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి ఎర్ర సముద్ర మార్గం ద్వారా సరఫరా కొనసాగుతోంది.
దేశీయ ఉత్పత్తిలోనూ పెరుగుదల
2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ యూరియా ఉత్పత్తి లక్ష్యాన్ని మించి నమోదైంది.
లక్ష్యం: 67.86 లక్షల టన్నులు
ఉత్పత్తి: 71.55 లక్షల టన్నులు
అదే విధంగా:
డీఏపీ ఉత్పత్తి: 9.84 లక్షల టన్నులు
ఎన్పీకే ఉత్పత్తి: 20.77 లక్షల టన్నులు
ఎస్ఎస్పీ ఉత్పత్తి: 13.50 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.
దేశంలో ఎరువుల నిల్వలు పుష్కలంగా
దేశ వార్షిక ఎరువుల అవసరం 383.9 లక్షల టన్నులు కాగా, ఇప్పటికే 197.56 లక్షల టన్నుల నిల్వలు సమకూర్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇది వార్షిక అవసరంలో 51 శాతానికి పైగా.
జూలై 2 నాటికి దేశంలో ఉన్న ఎరువుల నిల్వలు ఇలా ఉన్నాయి:
యూరియా – 69.08 లక్షల టన్నులు
డీఏపీ – 16.64 లక్షల టన్నులు
మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MOP) – 8.90 లక్షల టన్నులు
ఎన్పీకే – 45.64 లక్షల టన్నులు
ఎస్ఎస్పీ – 23.09 లక్షల టన్నులు
మొత్తంగా దేశంలో 163.35 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
రైతులకు కేంద్రం భరోసా
దిగుమతుల వైవిధ్యీకరణ, దేశీయ ఉత్పత్తి పెంపు, తగిన నిల్వల నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా అన్ని చర్యలు కొనసాగిస్తున్నామని, వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?