ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలో శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్స్ లో బ్లాస్టింగ్ తో వాయు ధ్వని కాలుష్యంతో గ్రామస్థులు తీవ్రంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇచ్చిన పరిధికి మించి బ్లాస్టింగ్ చేయటం వల్ల తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.