Ujjaini Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు.
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.