లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దేశ రాజధానిలో ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ సెల్ పోలీసులు.. 2,500 కోట్ల రూపాయల విలువైన 354 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.. డ్రగ్స్ రాకెట్కు సంబంధించిని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ ముఠాలో ఒకరు ఆప్ఘనిస్థాన్ జాతీయుడు. పంజాబ్ నుంచి ఒకరు, కాశ్మీర్ నుంచి ఒకరు.. మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి.…