దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్లు టీమిండియా విజయంతో మెరిశారు.
సంజూ శాంసన్, తిలక్ వర్మల అజేయ సెంచరీలతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో భారత్ 3-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది. వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో, భారత్ ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరును సాధించింది, ఆపై దక్షిణాఫ్రికాను 148 పరుగులకు ఆలౌట్ చేసి దక్షిణాఫ్రికాను 135 పరుగులకే ఆలౌట్ చేసింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు.
భారత్ దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ శుక్రవారం జోహన్నెస్బర్గ్లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND vs SA: నేడు టీ20 సిరీస్లో చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత్ ఈరోజు (శుక్రవారం) దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించినా.. బ్యాటింగ్లో టీమిండియా తడబడుతోంది.
దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 అందాల పోటీలో కీట్ యూనివర్సిటీ ఫ్యాషన్ స్కూల్ విద్యార్థిని తృష్ణా ర.. మిస్ టీన్ యూనివర్స్ 2024 టైటిల్ను గెలుచుకుంది. కిట్ ఫ్యాషన్ టెక్నాలజీ స్కూల్ విద్యార్థిని తృష్ణా రే ఈ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా కిట్ విశ్వవిద్యాలయం, ఒడిశా, భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల…
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. గ్వెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గం.కు ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ (నవంబర్ 10) సెయింట్ జార్జ్ పార్క్, గ్క్వెబర్హాలో జరగనుంది. కాగా.. తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో టీ20 టైమింగ్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రెండో టీ20 ఒక గంట ముందుగానే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు.