ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. నాలుగు నెలల క్రితం లావుగా కనిపించిన కిమ్ నాలుగు నెలల తరువాత స్లిమ్గా మారిపోయాడు. రోజు రోజుకు ఆయన బరువు తగ్గుతుండటంతో కొరియన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యాక్టీవ్గా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరించడంతో కిమ్ తన ఆరోగ్యంపైనా, బరువు తగ్గడంపైనా దృష్టిసారించారని అంటున్నారు. అయితే, సామన్యప్రజలు మాత్రం కిమ్ కు ఏదో ఆయిందని,…
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. దళిత అవేదన దీక్ష తర్వాత కలిసిన కాంగ్రెస్ నేతలు.. నిన్న సీఎం తో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అవ్వడం పై మాట్లాడుతూ… దీని పై సోషల్ మీడియా లో తప్పుగా ట్రోల్ అవుతుందని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారం పై జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. సమస్యలు సీఎం కి కాకుంటే ఇంకా ఎవరికి చెప్తాం అని అన్నారు. మేము కలిసింది…
పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో రెయిన్బో స్నేక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రెయిన్బో స్నేక్ చూడటానికి బ్లూకలర్లో కనిపిస్తుంది. లైట్ దానిపై పడే కొలదీ…
రైటర్ గా పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన కొరటాల శివ, దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత అపజయాన్నే ఎరగలేదు. అయితే కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా తన చిత్రాలకు సంబంధించిన విశేషాలను, తన కార్యకలాపాలను కొరటాల శివ అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇక సోషల్ మీడియాలో కొనసాగాలనుకోవడం లేదని కొరటాల శివ తెలిపారు. ఇకపై మీడియా మిత్రుల ద్వారా తన చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తానని ఆయన చెబుతున్నారు. జనాలతో తన…
ప్రపంచంలో ఎక్కువమంది సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సముద్రంలో దొరికే చేపలను పట్టుకొని జీవిస్తుంటారు. అయితే, ప్రతిరోజూ సముద్రంలో అద్భుతాలు జరుగుతాయని అనుకోకూడదు. ఒక్కోసారి అదృష్టం అలా కలిసి వస్తుంది. నిత్యం సముద్రంలో చేపలు పట్టుకొని జీవించే ఓ మత్స్యకారుడి వలకు ఓ పెద్ద చేప దొరికింది. ఆ చేపను పడవలోని బల్లపై ఉంచి కత్తిలో కోశాడు. చేప కడుపులో చేయిపెట్టి శుభ్రం చేస్తుండగా అతడికి ఓ బాటిల్ దొరికింది. దాన్ని చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు.…
పాము..ముంగీస బద్ద శతృవులు. పాము కనిపిస్తే ముంగీస దాన్ని చంపే వరకు ముంగీస ఊరుకోదు. రెండు ఒకదానికొకటి ఎదురుపడితే పెద్ద యుద్దమే జరుగుతుంది. పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మహారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీసలు ఎదురుపడ్డాయి. నువ్వానేనా అన్నట్టుగా ఫైట్ చేసుకున్నాయి. దాదాపుగా ఏడు నిమిషాలపాటు ఈ ఫైట్ జరిగింది. ముంగీస చేతిలో చావుదెబ్బలు తిన్న పాము అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే ముంగీస మాత్రం…
కేంద్రానికి, ట్విట్టర్కు మధ్య వార్ జరుగుతున్నది. కేంద్రం జారీ చేసిన ఐటీ మార్గదర్శకాలను ట్విట్టర్ అంగీకరించలేదు. గడువు దాటిన తరువాత సెంట్రల్ కంప్లయిన్స్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర్ ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. శశిథరూర్ ఆధ్వర్యంలో ఐటీ వ్యవహారాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఈ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. Read: రివ్యూ: ఇన్…
గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలుకు చేరింది. దీంతో సామాన్యులు పెట్రోల్ కొనుగోలు చేయాలంటే ఆలొచిస్తున్నారు. పెట్రోల్ ధరలకు భయపడి బయటకు రావడమే మానేశారు. పెట్రోల్ ధరలకు భయపడిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి 10 వేల రూపాయలు ఖర్చుచేసి జట్కాబండిని తయారు చేసుకున్నాడు. స్వతహాగా అతను రజకుడు కావడంతో నిత్యం దుస్తులను సేకరించేందుకు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది. దీంతో రజకుడు…
అనగనగా ఓ ఏనుగు. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్రవాహనం ఆగి ఉంది. ఆ వాహనం సైడ్ మిర్రర్కు తలకు పెట్టుకునే హెల్మెట్ తగిలించి ఉన్నది. దాన్ని చూసిన ఆ గజరాజు తినే వస్తువు అనుకుందేమో చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత తనకేమి తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాంలోని గుహవాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్…