SLBC Tunnel: ఎస్ఎల్బిసి (SLBC) టన్నెల్ విషాద ఘటన అందరికి తెలిసిన విషయమే. టన్నెల్ లో పనులు చేస్తున్న కార్మికులు లోపల చిక్కుకుపోయి ఎనిమిది మూర్తి చెందారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 53 రోజులుగా సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా ఆరుగురు మృతదేహాల ఆచూకి లభించకపోవడం విచారకరం. టన్నెల్ లో పేరుకుపోయిన మట్టి, టిబియం…
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్లో మధ్యాహ్నంలోపు మృతదేహాల వెలికితీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు.
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.