Pakistan: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం పాకిస్తాన్ చావుకొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. యూఎస్, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీతో పాటు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలో ఏకంగా యూఎస్ ఎంబసీపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఎంబసీ కాంపౌండ్లోకి ప్రవేశించడానికి చూసిన మూకపై యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు.…